గూగుల్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 14న అంటే రేపు మంగళవారం ఢిల్లీలో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో ఇదొక అపూర్వ ఘట్టంగా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం  ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వహయాంలో విధ్వంసానికి గురైన ఏపీ బ్రాండ్‌ను పునర్నిర్మిస్తున్నట్టు చెప్పారు. గూగుల్ సంస్థ పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకురాబోతోందని, దేశంలో అతి పెద్ద డేటా హబ్ గా విశాఖ మారబోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 

తన ఢిల్లీ పర్యటన సందర్బంగా విశాఖపట్నంలో 1-GW డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్‌తో ఒక చారిత్రక ఒప్పందంపై సంతకం చేయనుందని తెలిపారు. రాష్ట్రంతోపాటు దేశానికీ ఇది ప్రతిష్టాత్మక కార్యక్రమమని పేర్కొన్నారు. యువతకు ఏఐ, హైఎండ్‌ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. డేటా సెంటర్‌కు సింగపూర్‌ నుంచి సబ్‌మెరైన్‌ కేబుల్‌ను సముద్రమార్గంలో సంస్థ ఏర్పాటుచేస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వచ్చినప్పుడు కలిగిన ఆనందం, అనుభూతి తనకెప్పుడూ కలగలేదని చెప్పారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే గూగుల్ డేటా సెంటర్ ఒప్పందంతో సాంకేతిక దశ మారనుందన్నారు. 2029 చివరి నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.

హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ రావడంతో బ్రాండ్ వచ్చిందని... విశాఖకు గూగుల్‌ రాకతోనూ అదే పరిస్థితి వస్తుందన్నారు. విశాఖలో నవంబరు 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ''ఓవైపు డేటా సెంటర్. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్ రూపొందిస్తున్నాం. ఎప్పుడైనా ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తాయని ఊహించామా.. పరిశ్రమలకు కొందరు అడ్డుపడుతున్నారు... ఇది మంచిది కాదు. ఇంకొందరికి పెట్టుబడులు రాకుండా చేయడం, బెదిరించడం ఫ్యాషన్ గా మారింది. అలాంటి వాళ్లను ఉపేక్షించేది లేదని' సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ - నిప్పాన్ స్టీల్ ఏర్పాటు చేస్తున్న ఉక్కు కర్మాగారం, రామాయపట్నంలో బీపీసీఎల్ శుద్ధి కర్మాగారం, గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్... రానున్న కొన్ని సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌ను సంపన్న రాష్ట్రంగా మారుస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos