ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న భారత విద్యార్థుల విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో, భారత విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడే దేశంగా అమెరికాను అధిగమించి కెనడా మొదటి స్థానానికి చేరింది. ఈ కీలక విషయాలను నీతి ఆయోగ్ "భారత్‌లో ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ" పేరుతో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, 2016 నుంచి 2020 వరకు విదేశాలకు విద్యార్థులను పంపడంలో ఆంధ్రప్రదేశ్ వరుసగా మొదటి స్థానంలో ఉంది. 2018లో ఏపీ నుంచి రికార్డు స్థాయిలో 62,771 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు.

ఏపీ తర్వాత మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా భారత విద్యార్థుల ప్రాధాన్యతల్లోనూ స్పష్టమైన మార్పు కనిపించింది. 2016లో అమెరికాలో 4.23 లక్షల మంది భారత విద్యార్థులు ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 3.37 లక్షలకు తగ్గింది. ఇదే సమయంలో కెనడాలో భారత విద్యార్థుల సంఖ్య 94,240 నుంచి ఏకంగా 4.27 లక్షలకు పెరిగింది. ఇది దాదాపు 350 శాతం పెరుగుదల. అటు యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. అయితే, ఈ వలసల వల్ల దేశంపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ విద్య కోసం భారతీయులు చేస్తున్న ఖర్చు 2013–14లో దాదాపు రూ. 29,000 కోట్లు ఉండగా ఇది 2025 నాటికి 70 బిలియన్ డాలర్లకు (దేశ జీడీపీలో 2 శాతం) చేరుకోవచ్చని అంచనా.

ముఖ్యంగా ఇంజినీరింగ్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ వంటి STEM రంగాల్లోని ప్రతిభావంతులు దేశం విడిచి వెళ్లడం వల్ల పరిశోధన, అభివృద్ధి (R&D) రంగాలు బలహీనపడుతున్నాయని నివేదిక హెచ్చరించింది. ఈ "బ్రెయిన్ డ్రెయిన్"ను అరికట్టేందుకు జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా "ఇంటర్నేషనలైజేషన్ ఎట్ హోమ్" కార్యక్రమానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా, ప్రపంచ స్థాయి విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు అనుమతించడం, అలాగే ఐఐటీల వంటి భారత విద్యాసంస్థలు విదేశాల్లో క్యాంపస్‌లు తెరిచేలా ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos