రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికతను ఆయుధంగా ప్రయోగిస్తోంది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని 'ఏపీఏటీఎస్' (APATS) పేరుతో ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ యాప్ తో మద్యం బాటిల్‌పై ఉన్న లేబుల్‌ను స్కాన్ చేయడం ద్వారా దాని పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కీలక విషయాన్ని ప్రకటించారు.

'ఏపీఏటీఎస్' యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని, మద్యం బాటిల్ లేబుల్‌ను స్కాన్ చేస్తే చాలు, ఆ మద్యం ఎప్పుడు తయారైంది, దాని నాణ్యత ప్రమాణాలు, గడువు తేదీ వంటి కీలక సమాచారం మొత్తం క్షణాల్లో కనిపిస్తుందని మంత్రి రవీంద్ర వివరించారు. ఈ ఆధునిక విధానంతో కల్తీని గుర్తించడం తేలికవుతుందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది ఒక విప్లవాత్మక మార్పు తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య కల్తీ మద్యం వ్యాపారుల గుండెల్లో గుబులు పుట్టించడం ఖాయమని పేర్కొన్నారు. అంతకుముందు, మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పేర్ని నాని మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. "గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం కేసులో జైలుకు వెళ్లిన విషయాన్ని నాని మరిచిపోయినట్లున్నారు. ఇప్పుడు మా ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రవీంద్ర విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు సంయమనం, క్రమశిక్షణ నేర్పించారని, అందుకే ఓపిక పట్టామని, అయితే పేర్ని నాని హద్దులు దాటితే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో ఏ మరణం సంభవించినా దాన్ని మద్యానికి ముడిపెట్టి శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మంత్రి మండిపడ్డారు. శవాలతో రాజకీయాలు జగన్ కు అలవాటేనని ఆయన ఎద్దేవా చేశారు. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం ఒక రాజకీయ నాటకమని కొట్టిపారేశారు. కల్తీ మద్యం వ్యవహారంపై ప్రస్తుతం నాలుగు స్వతంత్ర బృందాలు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నాయని, నిందితులు ఎవరైనా, ఏ పార్టీకి చెందినవారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos