ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి దిల్లీ మీదుగా దావోస్ పర్యటనకు వెళ్లారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్తో రాష్ట్రానికి భారీ పెట్టుబడుల సాధనకు ఐదు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. సీఎం వెంట ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, అధికారులు ఉన్నారు. ఇవాళ జ్యూరిచ్లో ఉన్న భారత రాయబారితో సీఎం చంద్రబాబు బృందం భేటీ కానుంది. హిల్టన్ హోటల్లో 10 మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. హోటల్ హయత్లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహించనున్న భేటీలో తెలుగు పారిశ్రామిక వేత్తలతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. ఏపీని ప్రమోట్ చేయడం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై సమావేశంలో చర్చించనున్నారు.
అక్కడ నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకోనున్న సీఎం బృందం తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామిక వేత్తలతో డిన్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో సమావేశం కానున్నారు. రెండో రోజు సీఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చిస్తారు. అదేవిధంగా సోలార్ ఇంపల్స్, కోకకోలా, వెల్స్పన్, ఎల్జీ, కార్ల్స్బర్గ్, సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈవోలతో, చైర్మన్లతో చంద్రబాబు భేటీ అవుతారు.
యూఏఈ ఎకానమీ మినిస్టర్ అబ్దుల్లా బిన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహిస్తున్న ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే అంశంపై జరిగే చర్చలో ఆయన పాల్గొంటారు. ది నెక్ట్స్ వేవ్ పైనిరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమోరో చర్చా కార్యక్రమం సహా వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మూడో రోజు పలు బిజినెస్ టైకూన్లతో సీఎం సమావేశమవుతారు. రోజుకు కనీసం పదికిపైగా భేటీలు, సమావేశాలకు హాజరు కానున్నారు. నాలుగో రోజు చంద్రబాబు బృందం దావోస్ నుంచి జ్యూరిచ్ చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి రానున్నారు. కాగా గతంలో చంద్రబాబు దావోస్ లో పర్యటించడం వల్ల పెట్టబుడులు బాగా వచ్చాయి. పెట్టుబడులు వచ్చినా రాకపోయినా ఏపీని .. పెట్టుబడిదారుల గుడ్ లుక్స్లో ఉంచడానికి వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాల గుర్తుల్ని మర్చిపోయేలా చేయడానికి చంద్రబాబు విస్తృతంగా ప్రయత్నించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి .. రెండోసారి సీఎం హోదాలో దావోస్ వెళ్తున్నారు. గత ఏడాది వెళ్లారు కానీ అప్పటికి పదవి చేపట్టి స్వల్ప సమయం కాబట్టి.. అంతకు ముందు చేసిన ప్లానింగ్ ను బట్టే ఆయన టూర్ సాగింది. కానీ ఆ సారి మాత్రం.. తన టీమ్ ముద్ర స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దావోస్ లో తెలంగాణకు ప్రత్యేక పెవిలియన్ తో పాటు ఫోర్త్ సిటీని ప్రమోట్ చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న కేసీఆర్, జగన్ రెడ్డి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులు నేరుగా వెళ్తున్నారు. అదే తెలుగు రాష్ట్రాల పాలనలో వచ్చిన కీలక మార్పు అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos