మాజీ మంత్రి పేర్ని నాని కి బిగ్ షాక్ తగిలింది. అనూహ్యంగా 2019 కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆయనకు వారెంట్ జారీ అయింది. 2019లో టీడీపీ కార్యకర్తలు చందు, శ్రీహర్షపై కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని కేసు నమోదు చేయించారు. అయితే ఈ కేసులో ఆయన సాక్షిగా ఉన్నారు. కానీ ఈ కేసులో ఒక్కసారి కూడా ఆయన కోర్టుకు హాజరుకాలేదు. దీంతో తమ ఎదుట హాజరుకావాలని పలుమార్లు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే పేర్నినాని కోర్టుకు హాజరుకాలేదు. మూడు సార్లు వాయిదా వేసినా కానీ హాజరుకాకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. దీంతో ఆయనకు మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టుకు రాకపోవడంతో పేర్ని నానిపై మచిలీపట్నం కోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణకు పేర్ని నానిని హాజరుపరచాలని పోలీసులని మచిలీపట్నం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos