వైఎస్సార్​ జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం అటవీ, డీకేటీ భూములు ఆక్రమించిందనే ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విచారణకు ఆదేశించారు. సజ్జల కుటుంబ ఎస్టేట్‌లోని భూముల్లో అటవీ భూములెన్నో నివేదిక ఇవ్వాలని కడప కలెక్టర్‌ను ఆదేశించారు. వైఎస్సార్​ జిల్లా సీకేదిన్నె మండలంలోని సుగాలిబిడికి గ్రామం వద్ద దాదాపు 200 ఎకరాల్లో సజ్జల ఎస్టేట్ ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో సకలశాఖా మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు సజ్జల దివాకర్ రెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు బినామీ పేర్లతో వందల ఎకరాలు పట్టా భూములు, డీకేటీ భూములు కొనుగోలు చేశారు. ఇందులో కొన్ని అటవీ భూములు, డీకేటీ భూములను కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి.

వైఎస్సార్సీపీ హయాంలో కడప డీఎఫ్‌ఓగా పనిచేసిన అధికారిని అడ్డుపెట్టుకుని పట్టా భూముల్లోకి అటవీ భూములను కలిపేసుకుని లీగలైజ్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సజ్జల ఎస్టేట్‌ భూములకు కంచె, పెద్దపెద్ద గేట్లు పెట్టి లోపలికి ఎవర్నీ అనుమతించడంలేదు. ప్రధాన గేటుకు ఎదురుగా సర్వేనంబర్ 1612లో 5 ఎకరాల 14 సెంట్ల చుక్కల భూమి ఉంది. ఇందులో సుగాలిబిడికి గ్రామానికి చెందిన రాజానాయక్ భార్య బుక్కే దేవి పేరిట ఎకరా 34 సెంట్లు, బుక్కే ముత్యాలమ్మ పేరిట ఎకరా 30 సెంట్ల డీకేటీ పట్టాను 1993లో ప్రభుత్వం అందజేసింది. నాటి నుంచి బాధితులు ఆ పొలంలో మామిడిచెట్లు, ఇతర వ్యవసాయ పంటలు సాగు చేసుకుంటున్నారు. తన రెండున్నర ఎకరాలను సజ్జల ఎస్టేట్‌లో కలిపేసుకున్నారని, నోరెత్తితే చంపేస్తామని బెదిరించినట్లు రాజానాయక్ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు గతంలో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్‌కూ మొరపెట్టుకున్నారు. వైఎస్సార్​సీపీ హయాంలో రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకుని చాలామంది డీకేటీ పట్టా భూములను సజ్జల ఎస్టేట్‌లో కలిపేసుకున్నారనే ఆరోపణలున్నాయి.

ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ కడప కలెక్టర్‌ను ఆదేశించారు. ఏ మేరకు అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయి, అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి.. వన్య ప్రాణులకు ఏమైనా హాని కలిగిందా అనే వివరాలు సమర్పించాలన్నారు. అటవీ భూముల సంరక్షణకు చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని పవన్‌ ఆదేశించారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు ఈ విషయంపై నివేదిక సమర్పించగానే పవన్‌ కల్యాణ్‌కు కలెక్టర్‌ వివరాలు అందిస్తారని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos