ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని అధికార పీఠం నుంచి దించడానికి టిడిపి- జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీల మధ్య సీట్ల షేరింగ్ విషయంలో ఏర్పడ్డ గందరగోళం ఇప్పటికీ తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. రాజమండ్రి రూరల్ సీటు తనదేనని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటుండగా... కాదు ఆ సీటు విషయమై తనకు పవన్ కల్యాణ్ మాట ఇచ్చారంటున్నారు జనసేన నేత కందుల దుర్గేష్. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీటు టీడీపీ కంచుకోటల్లో ఒకటి. 2019 ఎన్నికల్లో జగన్ గాలి ప్రభంజనంగా వీచిన వేళ కూడా టీడీపీ నిలబెట్టుకున్న సీట్లలో రాజమండ్రి రూరల్ ఒకటి. ఇప్పుడు సడన్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేసిన క్రమంలో రాజమండ్రి రూరల్లో పోటీ చేసేది జనసేనా... లేక టీడీపీనా... బరిలో నిలిచేది బుచ్చయ్యా... లేక దుర్గేషా. అనే సందేహాలతో టీడీపీ కేడర్ సతమతమైపోతోంది. ఇక తన సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు చంద్రబాబును కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు బుచ్చయ్య. పవన్ ఆల్రెడీ టీడీపీ అధిష్టానంతో మాట్లాడారని దుర్గేష్ చెప్పడం, సైకిల్ సైన్యంలో కలవరాన్ని పెంచుతోంది. బుచ్చయ్య ట్వీటు తర్వాత సీటు ఫైటు మరింత వేడెక్కింది. ఇప్పుడు బుచ్చయ్య ముందున్న దారేంటి అనేదానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos