ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం 2025 -26 బడ్జెట్ ను భారీ అంచనాలతో ప్రవేశ పెట్టింది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పైన కూటమిలో చర్చ మొదలైంది.  అయిదు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్ధుల ఖరారు పైన కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలోనే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఈ నెల 5, 6 తేదీల్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. 5న ఉదయం ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు అదే రోజు ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అదే రోజు రాత్రి తిరిగి విశాఖపట్నం చేరుకుని, అక్కడే బస చేస్తారు. 6వ తేదీ చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్య క్రమంలో పాల్గొంటారు. తిరిగి విశాఖ నుంచే అదే రోజు మధ్యాహ్నం నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. 6వ తేదీన ఓ ఆంగ్ల చానల్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్దిక సంవత్సరం ముగుస్తున్న వేళ కేంద్రం నుంచి ఆర్దికంగా భారీ స్థాయిలో ఆర్థిక రుణ లబ్ధి దక్కించుకునే వెసులుబాటు పైన ముఖ్యమంత్రి చర్చలు చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇదే సమయంలో రాజకీయంగానూ సీఎం చంద్రబాబు ఢిల్లీ నేతలతో చర్చించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యే కోటాలో అయిదు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్ధుల ఖరారు పైన కసరత్తు జరుగుతోంది. అయిదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. జనసేన నుంచి నాగబాబుకు సీటు ఖాయమైంది. బీజేపీ తమకు ఒక స్థానం ఇవ్వాలని కోరుతోంది. ఈ సమయంలోనే సాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానం బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో, ఎమ్మెల్సీ స్థానం వచ్చేసారి బీజేపీకి కేటాయించేలా టీడీపీ ప్రతిపాదిస్తోంది. ఇక.. వైసీపీ నుంచి మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.

ఈ ఇద్దరు ఎంపీలు బీజేపీ - టీడీపీలో చెరొకరు చేరే విధంగా చర్చలు చేస్తున్నట్లు సమాచారం. ఇద్దరి తోనూ బీజేపీ టచ్ లో ఉండటంతో... తమ పార్టీలోనే చేరుతారని ఢిల్లీ నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం పైన చంద్రబాబు రాజకీయ చర్చల్లో తన అభిప్రాయం స్పష్టం చేసే ఛాన్స్ ఉందని పార్టీ నేతల సమాచారం. ఇక, ఈ నెల 7న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏపీ బడ్జెట్ ప్రతిపాదనలు.. సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్.. ఉద్యోగాల భర్తీ పైన ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఫలితాల పైన సమీక్ష తో పాటుగా కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్లే విధంగా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos