ప్రధాని మోదీ ఏపీ పర్యటన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సమయంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కు కేంద్రం కొద్ది నెలల క్రితం ఆర్దిక ప్యాకేజీ ప్రకటించింది. ఇప్పుడు మరింత రిలీఫ్ ఇచ్చేలా సీఎం చంద్రబాబు ఆర్దిక పరంగా మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని రాక వేళ ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఊరట ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన రెండు సంవత్సరాల బకాయిలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉక్కు ఫ్యాక్టరీ నష్టాలను ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఆ సంస్థకు ఆర్థిక చేయూతను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం గత ఏడాది ఆగస్టు నుండి రెండు సంవత్సరాల పాటు విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసిన మొత్తం బకాయిల విలువ 2,400 కోట్ల రూపాయలుగా ఉత్తర్వులలో పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్లాంటు యాజమాన్యం నుండి అందిన పలు వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రద్దు చేసిన మొత్తాన్ని భవిష్యత్తులో ప్రభుత్వ వాటాగా బదలాయించనున్నారు.

ఈ మొత్తాన్ని 7 శాతం వడ్డీతో పదేళ్ల తరువాత విశాఖ ఉక్కులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మార్చనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 753 కోట్ల బదలాయింపు ఛార్జీలు కూడా ఈ మొత్తంలోనే ఉంటాయి. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీఈపీడీసీఎల్, ఇంధన శాఖ, విశాఖ ఉక్కు సంస్థలకు ప్రభుత్వం సూచనలు చేసింది. గతంలో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కొన్ని ప్రతిపాదనలు చేసింది. కేంద్రం తరఫున విశాఖ ఉక్కుకు తాము రూ.11,440 కోట్లు ఆర్థిక సాయం చేస్తున్నామని, రాష్ట్రం తరఫున తమకు మూడు అంశాల్లో సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కు మంత్రిత్వ శాఖ కోరింది. అందులో భాగంగా మూడేళ్ల విద్యుత్‌,నీటి బిల్లులు మాఫీ చేయాలని ఉక్కు శాఖ కోరింది. దీనికి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,400 కోట్ల సాయం అందిస్తామని తెలిపింది. ఇక.. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులన్నింటికీ విశాఖ స్టీల్‌ను కొనుగోలు చేయాలని ఉక్కు మంత్రిత్వ శాఖ సూచించగా ఈ మేరకు పరిశీలన చేస్తున్నారని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos