బీజేపీ తలపెట్టిన 'అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన' యాత్రను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఎన్డీయే కూటమి నేతలకు పిలుపునిచ్చారు. ఈ నెల 11 నుంచి 25 వరకు జరిగే ఈ యాత్రలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులన్నీ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఎన్డీయే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్‌ను ‘రాజకీయ భీష్ముడు’గా అభివర్ణించారు. దేశంలో సుపరిపాలనకు వాజ్‌పేయ్ నాంది పలికారని, ఆయన తీసుకొచ్చిన విధానాలు దేశాభివృద్ధికి బలమైన పునాది వేశాయని కొనియాడారు. పోఖ్రాన్-2 అణు పరీక్షలతో ప్రపంచానికి భారత సత్తా చాటారని, కార్గిల్ యుద్ధంలో శత్రువుకు గట్టి సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు దేశ గతిని మార్చిందని అన్నారు. వాజ్‌పేయ్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని కూడా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. "రాష్ట్రాభివృద్ధి కోసం ఏది అడిగినా కాదనేవారు కాదు. విధానపరమైన నిర్ణయాలు వేగంగా తీసుకునేవారని" తెలిపారు. సుపరిపాలన విషయంలో ఎన్టీఆర్, వాజ్‌పేయ్ ఇద్దరూ ఒకేలా ఉండేవారని, వారి వ్యక్తిత్వాలు విశిష్టమైనవని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా వాజ్‌పేయ్ స్ఫూర్తితోనే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని చంద్రబాబు అన్నారు. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని, యువతకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు. వాజ్‌పేయ్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో కూటమి నేతలందరూ పాల్గొని ఆయన స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos