ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తోంది. ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్దినీ పరుగులు తీయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ విన్నూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే అందరికీ అందుతున్నాయి. రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో చేపట్టిన ఇలాంటి ఓ ప్రయత్నం సక్సెస్ కావడంతో పాటు గిన్నిస్ బుక్ రికార్డు కూడా అందుకుంది.

చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నియోజకవర్గం కుప్పాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ-సైకిళ్ల తయారీని ప్రోత్సహించింది. ఇలా దాదాపు 5 వేలకు పైగా ఈ-సైకిల్స్ ను నియోజకవర్గానికి చెందిన ఇ-మోటరాడ్ సంస్థ తయారు చేసింది. వీటిని స్థానికంగా పంపిణీ చేశారు. ఇలా మొత్తం 5555 ఈ-సైకిల్స్ ను పంపిణీ చేయడం ద్వారా చిత్తూరు జిల్లా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. దేశంలోని ఏ జిల్లాలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఈ-సైకిల్స్ తయారు చేసి పంపిణీ చేయలేదు. 5555 ఈ -సైకిళ్ల పంపిణీ చేపట్టి గిన్నిస్ రికార్డు సాధించిన చిత్తూరు జిల్లా అధికారుల్ని సీఎం చంద్రబాబు ఇవాళ అభినందించారు. పెద్ద ఎత్తున ఈ-సైకిళ్ల పంపిణీ చేపట్టి గిన్నిస్ రికార్డును సాధించినట్టు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు. దీంతో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా చిత్తూరు జిల్లా కలెక్టర్ గిన్నిస్ రికార్డు పత్రాన్ని అందుకున్నారు. కుప్పాన్ని కాలుష్య రహితంగా చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా 5555 ఈ-సైకిళ్ల పంపిణీ చేపట్టారు. ఇప్పటికే కుప్పంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల్ని పరుగులు తీయిస్తున్న చంద్రబాబు.. ఈ గిన్నిస్ రికార్డు ఘనతతో మరో మైలురాయి అధిగమించారు.

గతంలో ఒకేసారి పెద్దమొత్తంలో సైకిళ్లను డెలివరీ చేసిన రికార్డును తుడిచి పెట్టి కుప్పంలో చరిత్ర సృష్టించామని చంద్రబాబు ఈ సందర్బంగా తెలిపారు. ఈ-సైకిళ్ల వల్ల రాబోయే కాలంలో ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఈ-సైకిళ్లకు సూపర్ సైకిల్ అనే పేరు పెట్టామన్నారు. 60 కిలో మీటర్ల వరకు ఈజీగా సైకిల్ మీద వెళ్లి పని చేసుకోవచ్చన్నారు. సైకిల్ ఎక్కడికైనా దూసుకెళ్తుంది. అదే ఈ సూపర్ సైకిల్ ప్రత్యేకత అని చంద్రబాబు వెల్లడించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos