ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐవీఆర్ఎస్తో పాటు వివిధ రూపాల్లో లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ సిబ్బంది, ఉద్యోగులు, అధికారులపై వచ్చిన ఫీడ్ బ్యాక్పై అధికారులు చంద్రబాబుకు నివేదిక అందించారు.
పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాలు, పాలసీలపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపైనా చంద్రబాబు ఆరా తీశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏడు శాఖల్లో పథకాలు, కార్యక్రమాలపై సేకరించిన సర్వే ఫలితాలపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ మార్గాల్లో సేకరించిన వివరాల ఆధారంగా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయగా.. ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకెళ్లాలని సీఎం ఆదేశించారు.
ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబు తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos