ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రిలాక్సింగ్ మోడ్‌లోకి వెళ్లిన పొలిటికల్ లీడర్లు తిరిగి యాక్టివ్ అవుతున్నారు. పోలింగ్ పూర్తైన వెంటనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యూరోప్ టూర్‌కు వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం విదేశాలకు వెళ్లారు. అయితే విదేశీ పర్యటన పూర్తి చేసుకుని తిరిగొచ్చిన టీడీపీ చీఫ్ చంద్రబాబు యాక్షన్ మోడ్‌లోకి వచ్చారు. జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో.. అమెరికా నుంచి రాగానే టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు .. పలు కీలక అంశాలపై టీడీపీ నేతలకు సూచనలు చేశారు. అలాగే కౌంటింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ నెల 31న పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం కానున్నారు.  మరోవైపు మే 31వ తేదీన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కూడా జరగనుంది. ఇద్దరు నేతలు పోలింగ్ జరిగిన తీరు, ఆ తర్వాత పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం . బీజేపీ నేతలు కూడా అదే రోజు చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం. ఇక జూన్ ఒకటో తేదీ జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ శిక్షణ ఇవ్వనుంది. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించి వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. వైసీపీ నేతలు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా జూన్ మూడో తేదీన పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. మే 31వ తేదీన చంద్రబాబుతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్.. పోలింగ్ సరళి మీద, కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చిస్తారు. అనంతరం జూన్ మూడో తేదీన మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తంగా ఉండాల్సిన తీరుపై పవన్ వివరించే అవకాశం ఉంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos