వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అభిషేక్‌రెడ్డి విశాఖపట్నంలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్​రెడ్డి అన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడే వైఎస్​అభిషేక్‌రెడ్డి. గత ఎన్నికల్లో అభిషేక్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.లింగాల మండలానికి అభిషేక్ రెడ్డి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభిషేక్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. 

కాగా, అభిషేక్ రెడ్డి చనిపోయారని తెలియగానే.. వైసీపీ నేతలు ఏదో ఊహించుకుని టీడీపీపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. టీడీపీ నేతలు... శవ రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. అసలు వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోవడంపై టీడీపీ నుంచి ఎవరూ స్పందించలేదు. అయినా వైసీపీ నేతలు ఏదేదో ఊహించుకుని... అభిషేక్ రెడ్డి మృతిపై టీడీపీ శవ రాజకీయం చేస్తోందని లేనిపోని విమర్శలు చేస్తూ దుష్ప్ర చారానికి తెగబడుతున్నారు.

కాగా.. అసలు విషయం ఏమిటంటే అభిషేక్ రెడ్డి ఆస్పత్రిలో చావు బతుకుల్లో ఉన్నా .. జగన్ ఒక్కసారి కూడా పరామర్శించలేదన్నది నిజం. జగన్ దంపతులు తమ సొంత బంధువు అభిషేక్ రెడ్డి చికిత్స పొందుతున్నప్పుడు పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లలేదు. అభిషేక్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన బంధువులను పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదన్నది చాలా మందికి ఉన్న డౌట్. ఇదే డౌట్ వ్యక్తం చేస్తే..వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. చావును రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి వైసీపీ వాళ్లే ఈ చావుపై అతిగా స్పందించి రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos