ఏపీలోని విశాఖపట్నం నగరంలో భూకంపం సంభవించింది. ఈ రోజు మంగళవారం తెల్లవారుజామున ఉదయం 4:16 నుంచి 4:20 గంటల మధ్య భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే చాలామంది గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. కుటుంబసభ్యులతో కలిసి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం (NCS) వెల్లడించింది. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో కేంద్ర బిందువు (epicentre) నమోదైనట్లు తేలింది. ఈ కేంద్రం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విశాఖ నగరంలోని గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి, మహారాణిపేట, కైలాసపురం, విశాలాక్షినగర్, రాంనగర్, మురళీనగర్, అక్కయ్యపాలెం, కొంతమేరకు గాజువాక సమీప తీరప్రాంతాలు, భీమ్లిపట్నం మండల పరిసర గ్రామాల్లో భూకంప ప్రకంపనల ప్రభావం ఉంది. అకస్మాత్తుగా సంభవించిన ఈ పరిణామంతో నిద్ర నుంచి ఉలిక్కిపడిన నగరవాసులు ఏం జరుగుతోందో తెలియక ఆందోళన చెందారు. భయంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై గుమికూడారు. కొంతసేపటి వరకు ఇళ్లలోకి వెళ్లడానికి కూడా జంకారు. అయితే, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎంత నమోదైందనే వివరాలు ఇంకా అధికారికంగా వెలువడలేదు. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకపోవడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos