భూకంపం ఏపీని కుదిపేసింది. ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టేలా చేసింది. చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపారు. ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. ప్రత్యేకించి- ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాల్లో ఇవాళ భూ ప్రకంపనలు రికార్డయ్యాయి. జిల్లాలోని ముండ్లమూరుతో పాటు  తుళ్లూరు మండలంలో భూ ప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు, పోలవరం, పసుపుగల్లు, శంకరాపురం, మారెళ్ల, తూర్పుకంభంపాడు, వేంపాడులో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

తాళ్లూరు మండలంలోని గంగవరం, రామభద్రాపురం, తాళ్లూరుతో పాటుగా ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరులో ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. ఈ భూప్రకంపనలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రకాశం జిల్లాలో గతంలో కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలంలోని గ్రామాల్లోనే భూ ప్రకంపనలు వచ్చాయి.  కాగా డిసెంబర్ 4వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే. తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్‌లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూ ప్రకంపనలు సంభవించాయి. అప్పట్లో ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది. అక్కడ కొద్దిసేపు భూప్రకంపనలతో జనాలు భయంతో పరుగులు తీశారు.

తెలంగాణకు సరిహద్దులో ఉన్న నందిగామ, జగ్గయ్యపేటతో పాటుగా విజయవాడ, హనుమాన్‌ జంక్షన్‌, మచిలీపట్నం, గుడివాడ, పెనుగంచిప్రోలు, తిరువూరు, వీరులపాడు మండలాల్లో ప్రకంపనలు ప్రభావం కనిపించింది. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. అప్పట్లో అంటే డిసెంబర్ 4న సంభవించిన భూ ప్రకంపనలకు తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రమని గుర్తించారు. ఈ మేరకు భూ కంప కేంద్రంలో.. భూమి అడుగు భాగం నుంచి 200-300 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలను గుర్తించారు.. ఈ భూ ప్రకంపనలు రిక్టర్‌ స్కేల్‌పై 5.3గా నమోదైంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos