ఏపీ కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. బీజేపీ ఏపీలో కూటమిలో కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకునే వ్యూహాలు అమలు చేస్తోంది. రాజకీయంగా పట్టు బిగిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఏపీ నుంచి రాజ్యసభకు బీజేపీ రెండు స్థానాలను దక్కించుకుంది. పెద్దల సభ సీట్ల విషయంలో బీజేపీ మాటే చెల్లుబాటు అవుతోంది. ఇక, ఇప్పుడు ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి మాజీ ప్రధానికి కేటాయించే దిశగా కసరత్తు జరుగుతోంది. మిగిలిన మూడు స్థానాలు టీడీపీ, బీజేపీ, జనసేనకు దక్కే అవకాశం ఉంది. ఈ రేసులో మూడు పార్టీల నుంచి ముఖ్య నేతల పేర్లు చర్చలోకి వచ్చాయి.

రాజ్యసభలో ఏకంగా 72 స్థానాలకు 2026లో ఎన్నికలు జరుగనున్నాయి. పదవీ విరమణ చేస్తున్న వారిలో మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (కర్ణాటక), కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌, కేంద్ర మంత్రి జార్జి కురియన్‌ (మధ్యప్రదేశ్‌), కేంద్ర మంత్రి రవ్‌నీత్‌సింగ్‌ బిట్టూ (రాజస్థాన్‌), జేఎంఎం వ్యవస్థాపకుడు శిబూ సోరెన్‌ (జార్ఖండ్‌), కాంగ్రెస్‌ నేత శక్తిసింగ్‌ గోహిల్‌ (గుజరాత్‌), వైసీపీ ఎంపీలు పరిమళ్‌ నత్వానీ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ ఎంపీ సానా సతీశ్‌ ఉన్నారు.

ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఒక స్థానం మాజీ ప్రధాని దేవెగౌడకు కేటాయించాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జేడీఎస్ కు ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దేవెగౌడ - చంద్రబాబు మధ్య దశాబ్దాల కాలంగా మంచి సాన్నిహిత్యం ఉంది. అదేవిధంగా మరో మూడు స్థానాల్లో బీజపీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఈ సారి ఖాయమని చెబుతున్నారు. టీడీపీ నుంచి సానా సతీశ్ కు మరోసారి అవకాశం దక్కనుందని సమాచారం. జనసేన నుంచి పారిశ్రామిక వేత్త లింగమేనని రమేశ్ కు ఇప్పటికే హామీ దక్కిందని చెబుతున్నారు. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలు ఈ ఎంపికలో కీలకంగా మారాయి. ఇంకా సమయం ఉండటంతో.. చివరి నిమిషంలో మార్పులు చేర్పు లు జరిగితే.. మినహా ఏపీ నుంచి ఈ నలుగురు రాజ్యసభకు వెళ్లటం ఖాయమని సమాచారం. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos