ఏపీలోని డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు భారీ సబ్సిడీలతో కూడిన రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు జీవనోపాధి కల్పించే లక్ష్యంతో 'వెలుగు', పశుసంవర్ధక శాఖలు సంయుక్తంగా లబ్ధిదారులను గుర్తిస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల సభ్యులతో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి, ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేస్తున్నారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ, స్త్రీనిధి వంటి పథకాల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా పాడి పశువులు (ఆవులు, గేదెలు), గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం వంటి యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉదాహరణకు.. రూ.లక్ష విలువైన యూనిట్‌కు ప్రభుత్వం రూ.35 వేల సబ్సిడీ అందిస్తుండగా, మిగిలిన రూ.65 వేలను బ్యాంకులు రుణంగా సమకూరుస్తాయి. రెండు పశువులు, షెడ్డు నిర్మాణంతో కూడిన రూ.2 లక్షల యూనిట్‌కు అయితే రూ.75 వేల వరకు రాయితీ లభించనుంది. మిగిలిన రూ.1.25 లక్షలను బ్యాంకు రుణం ద్వారా పొందవచ్చు.

పశుపోషణే కాకుండా ఇతర చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. బేకరీలు, పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్లకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అయ్యే ఖర్చులో సబ్సిడీ ఇవ్వనున్నారు. అలాగే, వరికోత యంత్రాలు, రోటావేటర్ల వంటి వ్యవసాయ పరికరాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విలువైన యూనిట్లపై రూ.1.35 లక్షల వరకు రాయితీ కల్పించనున్నారు. ఈ రుణాలను, సబ్సిడీలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. దీనికి తోడు, భవిష్యత్తులో స్త్రీ నిధి, ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి వంటి పథకాలను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

Related Videos