ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ రోజు రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు జరుగుతోంది. గతంలో మాదిరిగానే ఇ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపునకు సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయిస్తున్నారు. రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఇ-లాటరీ నిర్వహించారు. అదేవిధంగా ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లు కేటాయించనున్నారు. ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరగనుంది.

ఉదయం 14 గ్రామాల పరిధిలోని రైతులకు ప్లాట్ల కేటాయింపు జరిగింది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లి గ్రామంలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు లాటరీ నిర్వహించి ప్లాట్లను ఖరారు చేస్తారు. కంప్యూటర్ ఆధారిత ఈ లాటరీ విధానం వల్ల ఎవరికీ ఎటువంటి పక్షపాతం లేకుండా, పూర్తి పారదర్శకంగా ప్లాట్ల నంబర్లు కేటాయించబడతాయి. దీనివల్ల రైతులకు తమకు రావలసిన నివాస మరియు వాణిజ్య ప్లాట్లపై స్పష్టత రానుంది. మరోవైపు, మిగిలిన రైతులకు కూడా త్వరలోనే ప్లాట్లు ఇచ్చేందుకు సీఆర్‌డీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్డు (Seed Access Road) నిర్మాణానికి భూములు ఇచ్చిన వారు, అలాగే ఉండవల్లి పరిధిలోని జరీబు భూములిచ్చిన రైతులకు తదుపరి విడతలో ప్లాట్లు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.

అమరావతి రాజధాని పనులు తిరిగి పుంజుకుంటున్న తరుణంలో, రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగడం ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మరియు అభివృద్ధి పనులకు మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు.. భవిష్యత్తు అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం భూ సేకరణ కూడా చేస్తున్న విషయం విదితమే.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos