ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రోడ్లు, మౌలిక వసతుల కల్పన, హైస్పీడ్ కారిడార్లపై ఫోకస్ చేసింది. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో వందే భారత్ రైళ్లు పెంచడం, బుల్లెట్ రైలు అవకాశాలపై చర్చలు జరుపుతూనే.. రాష్ట్రంలో వీలున్నచోట హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటు కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీకి మరో హైస్పీడ్‌ కారిడార్‌ రానుంది. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి-16 ఏపీ మీదుగా వెళ్తుండగా.. దీనికి సమాంతరంగా ఒక కొత్త హైవే నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్‌) నిర్ణయం తీసుకుంది. 

పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు రాజధాని చెన్నైకి గ్రీన్‌ఫీల్డ్‌ హైస్పీడ్‌ కారిడార్‌ నిర్మించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌పై మోర్త్‌ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం సలహా సంస్థను ఎంపికచేసి, హైవే ఎలా నిర్మించాలనే దానిపై అధ్యయనం చేయించనుంది. ఇప్పటికే కోల్‌కతా-చెన్నై హైవేలో భాగంగా కత్తిపూడి-కాకినాడ నుంచి ఒంగోలు వరకు జాతీయ రహదారి 216 ఉంది. కేంద్రం తాజాగా కోల్‌కత్తా నుంచి చెన్నై మధ్య హైస్పీడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త హైవే విశాఖపట్నం సిటీకి సమీపం నుంచి వెళుతుంది. విజయవాడ సమీపంలో అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌తో హైస్పీడ్ కారిడార్ కలపనున్నారు. తద్వారా గుంటూరు అవతల అదే ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నుంచి మిగిలిన భాగం కొనసాగుతుంది. ఆ మార్గాన్ని చెన్నై వరకు నిర్మించకపోయినా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు మధ్య కోల్‌కతా-చెన్నై హైవేలో కలపాలని మోర్త్ ప్లాన్ చేసింది. దీన్ని పూర్తి స్థాయిలో చెన్నై వరకు కొనసాగిస్తేనే గ్రీన్‌ఫీల్డ్‌తో పాటు, యాక్సెస్ కంట్రోల్ హైవే నిర్మాణం జరుగుతుందని భావిస్తున్నారు. 

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఏడు హైవేల మీదుగా వెళ్తుంది కనుక అభివృద్ధి జరిగేందుకు వీలుంటుంది. హైస్పీడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే ఉత్తర, తూర్పు భారత్.. దక్షిణాది రాష్ట్రాలను అనుసంధానం చేస్తుందని మోర్త్ భావిస్తోంది. విజయవాడ, అమరావతి చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు హైస్పీడ్ కారిడార్ వెళ్లే సమీప ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరుగుతుంది. కొత్త కంపెనీలు, పరిశ్రమలు వస్తాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అమరావతికి మరింత ప్రయోజనం చేకూర్చుతుంది. నెల రోజుల్లో ఈ హైస్పీడ్ కారిడార్‌పై స్పష్టత రానుంది. మోర్త్‌ ఉన్నతాధికారులు ప్రాజెక్టు ఎలైన్‌మెంట్ల తయారీని పరిశీలిస్తున్నారు. ఎలైన్‌మెంట్ మీద కసరత్తు పూర్తయితే ఖరగ్‌పూర్‌- చెన్నై హైస్పీడ్ కారిడార్ వెళ్లే రాష్ట్రాల ప్రభుత్వాలతో సమావేశమై, వారి పర్మిషన్, అభ్యంతరాలు స్వీకరించి తుది ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేయనున్నారని... ప్రాజెక్టు వ్యయం, భూసేకరణ కీలకం కానున్నాయని జాతీయ రహదారుల అధికారులు చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos