రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీలో వైసీపీ మరింత దిగజారుతోందని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన తెనాలి ఘటనను సైతం వైసీపీ కులం, మతం రంగులద్ది రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారుతోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెనాలి ఘటనకు సంబంధించిన యువకులపై పలు కేసులు ఉన్నాయని, పోలీసులపైనే వారు చేయి చేసుకున్నారని డీజీపీ వెల్లడించినట్లు అనిత గుర్తుచేశారు. అలాంటి గంజాయి బ్యాచ్ ఇంటికి వైసీపీ అధినేత జగన్ వెళుతున్నారని... ఇది కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి, కులమతాలను రెచ్చగొట్టడానికేనని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే, తమ కార్యకర్తలకు బీపీ వచ్చిందని జగన్ సమర్థించుకున్నారని గుర్తుచేశారు.
వైసీపీ హయాంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను నడిరోడ్డుపై కొట్టినా, రాజమండ్రిలో ఇసుక మాఫియాపై మాట్లాడిన వరప్రసాద్కు పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేసినా ఆనాడు జగన్ ఎందుకు స్పందించలేదని, వారి ఇళ్లకు వెళ్లి ఎందుకు పరామర్శించలేదని అనిత నిలదీశారు. పులివెందులలో మహిళ హత్యకు గురైనప్పుడు తాము వెళితే కేసు పెట్టారని అన్నారు. తమ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు లేవని, వైసీపీ నేతలు పోలీసులకు అడ్డు తగలకుండా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని ఆమె సూచించారు. పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించవద్దని అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos