ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సచివాలయ వ్యవస్థలో సంస్కరణల అమలుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు శ్రీకారం చుట్టిన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ.. తాజాగా మండల, మున్సిపల్‌, జిల్లా స్థాయిలో సచివాలయాలను పర్యవేక్షించడానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో 2778 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, 1785 పోస్టులను డిప్యుటేషన్‌ లేదా ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు, మరో 993 కొత్త పోస్టులు సృష్టించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో గ్రామవార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయం, డైరెక్టరేట్‌ స్థాయిలో ఇందు కోసం పంక్షనల్‌ అసిస్టెంట్‌ పేరుతో12 పోస్టులను మంజూరు చేశారు.

జిల్లా స్థాయిలో పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 2,231 పోస్టులను మంజూరు చేశారు. జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారి, సూపరిండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ కోఆర్డినేటర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ సబ్‌ ఆర్టినేట్‌, మండల గ్రామ, వార్డు సచివాలయాల అధికారి, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు మంజూరు చేశారు. నగరాలు, పట్టణాల్లో మరో 535 పోస్టులను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ రూపొందించిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ఈ మూడంచెల వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం అమలుకు విధి విధానాలు ఖరారు చేసారు. ఆయా మండలాలు, పట్టణ స్థానిక సంస్థల నుంచి 1,785 మందిని డిప్యుటేషన్‌పై వినియోగించుకోనున్నారు.

993 కొత్త ఏఎన్‌ఎం, వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులను సృష్టించనున్నారు. మండల స్థాయిలో పంచాయతీరాజ్‌శాఖ ఫస్ట్‌ లెవల్‌ గెజిటెడ్‌ అధికారిని మండల గ్రామ లేదా వార్డు సచివాలయ అధికారిగా నియమిస్తారు. ఇందుకోసం 660 మందిని డిప్యుటేషన్‌పై తీసుకుంటారు. మండలాల్లో 1,320 మంది జూనియర్‌ అసిస్టెంట్లను ఇదే శాఖ నుంచి డిప్యుటేషన్‌పై నియమిస్తారు. అదే విధంగా పురపాలక శాఖకు చెందిన ఇద్దరు రీజినల్‌ డైరెక్టర్‌ కమ్‌ అప్పిలేట్‌ కమిషనర్లు, ఆరుగురు సెలెక్షన్‌ గ్రేడ్‌ లేదా జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులను అదనపు కమిషనర్లుగా.. మరో 9 మందిని జిల్లా గ్రామ లేదా వార్డు సచివాలయ శాఖ అధికారులుగా డిప్యుటేషన్‌పై నియమించాలని నిర్ణయించారని సమాచారం.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos