ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. లోక్ సభ ఎన్నికల సమయంలోనూ, రాజ్యసభకు అభ్యర్థి ఎంపిక విషయంలోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు లక్కీ ఛాన్స్ మిస్ కావడంతో ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం పైనే కూటమి పార్టీల్లో కొత్త చర్చ మొదలైంది. ఇంతకీ నాగబాబు కేబినెట్ లో చేరేది ఎప్పుడనేది ఆసక్తికర డిబేట్ గా మారింది.
జనసేనకు ప్రస్తుతం పవన్ తో పాటుగా ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేన నుంచి బీసీ వర్గాలకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు పెండింగ్ స్థానంలో జనసేన తరపున బీసీ వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందనే చర్చ జనసేన మద్దతు దారుల్లో వినిపిస్తోంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో నారా - మెగా కుటుంబాలకు పదవులు దక్కటం.. నందమూరి కుటుంబానికి పదవులు ఇవ్వకపోవటం పైనా చర్చ కొనసాగుతోంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య కు మంత్రి పదవి ఇవ్వకుండా ..ఇప్పుడు నాగబాబు కు ఇవ్వటం ఏమిటనే చర్చ సోషల్ మీడియా కేంద్రంగా సాగుతోంది. ఇదే సమయంలో టీడీపీలోనూ దీనిపైన ఆసక్తి కర చర్చ జరుగుతోంది.
పైగా ఈ సారి మంత్రివర్గంలో టీడీపీ నుంచి సీనియర్ నేతలైన పలువురు ఆశావాహులకు స్థానం దక్కకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో టీడీపీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా జనసేనకు చెందిన నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచనపై టీడీపీలో గుసగుసలు మొదలయ్యాయని అంటున్నారు. అయితే, చంద్రబాబు మంత్రివర్గంలోకి నాగబాబుకు అవకాశం పై ప్రకటన చేయటంతో ఈ నిర్ణయం నుంచి వెనక్కు తీసుకునే అవకాశం లేదని.. మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం టీడీపీ - జనసేనలో జరుగుతున్న చర్చ పైన రెండు పార్టీల అధి నాయకత్వం ఆరా తీస్తోంది. దీని పైన చంద్రబాబు - పవన్ ఎలా ముందుకు వెళ్తారనే అంశం పైన ఆసక్తి కొనసాగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos