వైసీపీకి రాజీనామా చేయబోతున్నారన్న ప్రచారాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి క్లారిటీ.ఇచ్చారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న అయోధ్య రామిరెడ్డిని కలిసిన మీడియా ప్రతినిధులు మీరు వైసీపీకీ, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారా అని ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ.. నా రాజీనామాపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని.. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు.
ఇటీవల వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీలోని ఇతర రాజ్యసభ సభ్యుల వ్యవహారంపై ఊహాగానాలు వెల్లువెత్తాయి. విజయసాయిరెడ్డి బాటలోనే వైసీపీకి చెందిన మరో ఇద్ధరు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పిస్తారన్న ప్రచారం బలంగా వినిపించింది. వారిద్దరూ నిన్నటిదాకా ఢిల్లీలోనే ఉండిపోవడంతో వారి రాజీనామాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే వారు వైసీపీలోనే కొనసాగుతారని తిరుపతి ఎంపీ గురుమూర్తి సహా ఆ పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. తాజాగా అయోధ్య రామిరెడ్డి సైతం తన రాజీనామా వార్తలను ఖండించడం విశేషం.
అయితే ఢిల్లీ ఆపరేషన్ లో భాగంగా ఎన్డీఏ వ్యూహాల మేరకు రాజ్యసభలో వారి బలం పెంచుకునే క్రమంలో వైసీపీ సభ్యులు రాజీనామా చేయడం తధ్యమన్న ప్రచారం కొనసాగుతూనే ఉండటంతో వైసీసీ రాజ్యసభ సభ్యుల రాజీనామా వ్యవహారంలో ఉత్కంఠత కొనసాగుతోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos