మాజీ సీఎం జగన్ రూటు మార్చారు. ఎన్నికల్లో పరాజయం తరువాత 11 సీట్లకే పరిమితం కావటం పైన సమీక్ష చేసారు. ఎన్నికల్లో ఓటమికి గల ప్రతీ కారణం పైన విశ్లేషించారు. పొరపాట్లను సరిదిద్దుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా పార్టీ కేడర్ కు ప్రాధాన్యత ఉంటుందని ప్రతీ సమావేశంలోనూ చెబుతూ విశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ పీఏసీతో పాటుగా జిల్లాలు.. అనుబంధ కమిటీలను ఖరారు చేసారు. ఇప్పుడు తాజాగా రేపటి నుంచి వరుసగా రెండు రోజుల పాటుగా పీఏసీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసారు. ఈ భేటీలో పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం.. కార్యకర్తలతో మమేకం.. ప్రభుత్వం పైన పోరుబాట.. కేడర్ కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల పైన సమీక్ష చేయనున్నారు.

మరోవైపు చాలాకాలంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని సీనియర్లు సూచిస్తున్నారు. ప్రతీ ఏటా పార్టీ ప్లీనరీ.. సభ్యత్వ నమోదు కొనసాగించాలని అప్పట్లోనే ప్రతిపాదన వచ్చింది. అధికారంలో ఉన్న సమయంలో కూడా పార్టీ సభ్యత్వం పైన జగన్ నిర్ణయం తీసుకోలేదు. ఇతర పార్టీల్లో సభ్యత్వ నమోదుతో పాటుగా సభ్యత్వం తీసుకున్న వారికి భీమా సదుపాయం కల్పిస్తున్నారు. వైసీపీలో మాత్రం అమలు కావటం లేదు. దీంతో, పార్టీని తిరిగి క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే క్రమంలో పార్టీ సభ్యత్వం.. భీమా సదుపాయం ఇతర పార్టీల కంటే ఎక్కువ మొత్తం అందేలా నిర్ణయించారు. దీనికి సంబంధించి సభ్యత్వ రసుము.. ఆరోగ్య భీమా ఎంత మేర ఇవ్వాలనేది రేపు మంగళవారం జరిగే పార్టీ పీఏసీ సమావేశంలో చర్చించి తుది ఆమోద ముద్ర వేయనున్నారు.

ఓడిన తరువాత పార్టీలో నిస్తేజం తెలిగించేందుకు పార్టీ ప్లీనరీ నిర్వహణ దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అంశం పైన ఈ రెండు రోజు సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. జగన్ వారంలో మూడు రోజులు మాత్రమే తాడేపల్లిలో అందుబా టులో ఉంటున్నారు. మిగిలిన కాలం బెంగళూరుకు వెళ్తున్నారు. జూలై 8, 9 తేదీల్లో ప్లనరీ నిర్వహణ ద్వారా తన జిల్లాల పర్యటనలు.. పార్టీ కార్యాచరణ పైన జగన్ దిశా నిర్దేశం చేయాలని భావిస్తున్నారు. మే లో కడప కేంద్రంగా టీడీపీ మహానాడు నిర్వహిస్తుండటంతో.. గోదావరి జిల్లాల్లో ప్లీనరీ నిర్వహణ దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. జగన్ సైతం ఇక కూటమి తో పోరాటానికి సై అనేందుకు సిద్దమయ్యారు. ఈ రెండు రోజుల సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల పైన ఇప్పుడు వైసీపీలో ఆసక్తి కొనసాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos