శ్రీసత్యసాయి జిల్లా, కొత్తచెరువు: రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే ప్రక్రియను విద్యాశాఖ ద్వారా ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. కొత్తచెరువు జడ్పీ హై స్కూల్‌ లో నిర్వహించిన మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా నిలవాలన్నదే మా లక్ష్యం. విద్యతో పాటు విద్యార్థులకు ఆటలు, సంగీతం, యోగా వంటి సమగ్ర అభివృద్ధిని అందిస్తున్నాం” అని చెప్పారు. వారు గురువుల పాత్రను కొనియాడుతూ, "విద్యార్థుల విజయానికి బలమైన పునాది వారి టీచర్లే. జీవితాన్ని మార్గనిర్దేశం చేసే పాఠాలు తరగతి గదిలో నేర్చుకుంటారు. తల్లుల పట్ల గౌరవాన్ని పెంచేందుకు తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపట్టాం" అని వివరించారు.

అలాగే, పదో తరగతి మరియు ఇంటర్ విద్యార్థుల మెరుగైన ఫలితాలను ప్రస్తావిస్తూ, "షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ ద్వారా సామర్థ్యం ఉన్న కానీ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మద్దతు అందిస్తున్నాం" అన్నారు. పాఠశాలల్లో రాజకీయాలకు చోటు ఉండదని స్పష్టం చేసిన లోకేశ్, "పాఠశాలలను నైతిక విలువల వేదికలుగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం జరగడం ఒక చరిత్రాత్మక అంశం" అని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ "అమ్మ పేరుతో మొక్క నాటండి" అన్న పిలుపును ఉల్లేఖిస్తూ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విసిరిన కోటి మొక్కల సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్టు లోకేశ్ ప్రకటించారు. “ఈ సవాల్‌ను గౌరవంగా తీసుకుంటూ, విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాం” అని స్పష్టం చేశారు.

 

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos