దావోస్: ప్రపంచవ్యాప్తంగా ఎఐ ట్రాన్సర్మేషన్ కారణంగా డాటా సైంటిస్టులు, ఎఐ ట్రైనర్లు, ఎథికల్ ఎఐ స్పెషలిస్టులకు డిమాండ్ ఏర్పడుతుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గ్లోబల్ ఎకానమీస్ & లేబర్ మార్కెట్లపై AI పరివర్తన ప్రభావం (The Transformative Impact of AI on Global Economies & Labour Markets) అనే అంశంపై దావోస్ ఆల్పెన్ గోల్డ్ హోటల్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు.  సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... మ్యానుఫ్యాక్చరింగ్, కస్టమర్ సర్వీస్, డేటా ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 25 నుంచి 30శాతం వరకు టాస్కులు ఆటోమేషన్ అవుతాయి, దీనిప్రభావం ఆయారంగాల్లో పనిచేసే ఉద్యోగులపై ఉంటుంది. ఎఐ ట్రాన్సర్పేషన్ నేపథ్యంలో రీస్కిల్లింగ్ అవసరం. ఇందుకోసం ప్రభుత్వాలు, కార్పొరేట్లు కలసిపనిచేయాల్సి ఉంది. 

భారత్ లో ఎఐ సంబంధిత వనరులకు జాతీయ ఎఐ పోర్టల్ రిపోజిటరీగా పనిచేస్తోంది. వ్యక్తులు, సంస్థలు ఎఐలో అవకాశాలను అన్వేషించడానికి ఈ పోర్టల్ సహాయపడుతుంది. డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా నిర్వహిస్తున్న అక్షరాస్యత కార్యక్రమాలు భవిష్యత్ ఎఐ శిక్షణకు పునాదిగా నిలుస్తాయి. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ వంటి జాతీయ-స్థాయి కార్యక్రమాలు, NASSCOM, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ సంయుక్త ప్రయత్నాలు AI, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్‌లో నైపుణ్యం పెంపొందించడానికి దోహదపడతాయి . ఎపిలో ఎఐ విద్య అభివృద్ధికి గూగుల్ తో సహా ప్రముఖ సంస్థలతో కలసి పనిచేస్తాం. రాష్ట్రంలో తొలి ఏఐ స్కిల్స్‌ ల్యాబ్‌ని విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో ఏర్పాటు చేశారు. చీపురుపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు 500 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ‘ఏఐ ఫర్ ఆల్’ కార్యక్రమం కింద ఉపాధ్యాయులు శిక్షణ కూడా తీసుకున్నారు. భవిష్యత్ తరం AI నిపుణులు, పరిశోధకులు, అభ్యాసకులకు శిక్షణనిచ్చేందుకు AI విశ్వవిద్యాలయాన్ని స్థాపించబోతున్నామని మంత్రి లోకేష్ చెప్పారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos