రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి అందరూ మాట్లాడతారని, కానీ బాధ్యతల గురించి ఆలోచించరని, హక్కులతో పాటు బాధ్యతలు కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరిలోని మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని కూర్మాల శ్రీ కనకపుట్లమ్మ, రేపు జరగనున్న 'స్టూడెంట్ మాక్ అసెంబ్లీ'కి ఎంపికైన సందర్భంగా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు విద్యార్థినిని, ఆమె కుటుంబ సభ్యులను ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించి మాట్లాడారు.

మంగళగిరి బీఆర్ నగర్‌లోని మున్సిపల్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న శ్రీ కనకపుట్లమ్మ, పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఈ గౌరవాన్ని దక్కించుకుంది.  ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "నేటి విద్యార్థులే రేపటి మా భవిష్యత్. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా యువశక్తి ప్రాధాన్యత గురించి తరచూ చెబుతుంటారు. రాజ్యాంగ దినోత్సవం రోజున విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించాలనే ఆలోచనను సీఎం గారితో చర్చించి నిర్ణయించామని"  తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని లోకేశ్ వివరించారు. "అమ్మకు చెప్పలేని పనులు చేయకూడదని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు నిన్నటి విలువల విద్యాసదస్సులో చక్కగా చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తాం. విద్యార్థులు బాగా చదువుకుని, ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని" ఆకాంక్షించారు.

ప్రతి ఏటా స్టూడెంట్ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని, కనకపుట్లమ్మను చూసి మరో పది మంది విద్యార్థులు స్ఫూర్తి పొందుతారని అన్నారు. ఈ సందర్భంగా, "రేపటి మాక్ అసెంబ్లీలో మాకేమైనా సలహాలు, సూచనలు ఇస్తారా?" అని మంత్రి సరదాగా వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి సీఎం, స్పీకర్ హాజరవుతున్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాక్ అసెంబ్లీకి ఎంపికవడంపై విద్యార్థిని ఆనందం వ్యక్తం చేస్తూ, ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం గతంలో కంటే మెరుగ్గా ఉందని తెలిపింది. దీనిపై స్పందించిన లోకేశ్, రాష్ట్రవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు మరింత నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం విద్యార్థిని కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పుట్టుకతో దివ్యాంగుడైన ఆమె తండ్రి రాము, ట్రై-స్కూటర్‌పై కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారని తెలుసుకున్నారు. తమ ఇద్దరు కుమార్తెలకు 'తల్లికి వందనం' పథకం అందుతోందని, తనకు రూ.6,000 పింఛన్ వస్తోందని రాము మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన లోకేశ్, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. "మంగళగిరి నా కుటుంబంలా మారిపోయిందని .. నాపై మరింత బాధ్యత పెరిగిందని" అన్నారు. విద్యార్థిని శ్రీ కనకపుట్లమ్మ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మంత్రిని కలవడం పట్ల విద్యార్థిని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos