ఏపీ రాజధాని అమరావతిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద నిన్న 23వ తేదీ సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు చెందిన ప్లాస్టిక్ పైపుల వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భారీగా ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. దీంతో స్థానికులు, కంపెనీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.  పైపులు అధికంగా ఉండటం, దట్టమైన పొగ కారణంగా మంటలను అదుపు చేయడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు కానీ భారీ ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా అమరావతిలో వరుసగా జరుగుతున్న ఈ అగ్నిప్రమాదాలు ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. సాధారణంగా అగ్నిప్రమాదం జరగడానికి ఆస్కారం లేని ఖాళీ ప్రదేశాల్లో, నిల్వ ఉంచిన పైపులే లక్ష్యంగా మంటలు అంటుకోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో వెలగపూడి సమీపంలో కూడా ఇదే తరహాలో పైపులకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన మరువక ముందే, ఇప్పుడు రాయపూడిలో పునరావృతం అయింది. రాజధాని పనులను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే అసాంఘిక శక్తులు ఈ దారుణానికి ఒడిగడుతున్నాయని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

గతంలో జరిగిన ప్రమాదాలపై ముఖ్యమంత్రి స్వయంగా విచారణకు ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో నిఘా యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో అమరావతి ప్రాంతంలో చెరుకు తోటలకు నిప్పు పెట్టిన చేదు అనుభవాలు ఉన్నా, కీలకమైన నిర్మాణ సామాగ్రి వద్ద భద్రతను పటిష్టం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్నిప్రమాదాలు జరిగిన ప్రతిసారీ దర్యాప్తు పేరుతో కాలయాపన చేయడం వల్లనే అసాంఘిక శక్తులు తెగబడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిఘా కెమెరాలు, పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంలో అధికారులు విఫలమయ్యారనేది స్పష్టమవుతోంది.

అమరావతి రాజధాని పనులు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుని, వరల్డ్ బ్యాంక్ నిధులు మంజూరైన తరుణంలో ఇలాంటి ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఆస్తికి భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, నిర్మాణ గడువుపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని, వాళ్ల కుట్ర కూడా అదేననే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos