మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026లో ఆయన ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. నిన్న గురువారం రాత్రి మాదాపూర్ హైటెక్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈవెంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... విజేతలందరికీ అభినందనలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా కళాకారులకు అవార్డులు ఇస్తే ప్రోత్సాహకంగా ఉంటుందని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. 'తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. కళాకారులు ఉన్న చోటే సుభిక్షంగా ఉంటుందనేది నానుడి. ఈ అవార్డులు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. "ఏపీ ప్రభుత్వం కూడా ఇలా అవార్డులు ఇస్తే బాగుంటుంది.' ఆంధ్రప్రదేశ్ కళాకారుల పట్ల, సినిమాల పట్ల ఉత్సాహపరిచే విధానంలో కాస్త వెనుకంజ వేసిందని అనుకుంటున్నాను. సినిమాలకు దగ్గరగా ఉండే సీఎం చంద్రబాబు గారు దీన్ని ప్రేరణగా తీసుకొని మరింత ప్రోత్సహించాలి. తద్వారా రాష్ట్రానికి రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఈ ఆలోచన చేయాలని ఈ వేదిక నుంచి విన్నవిస్తున్నాను’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవితో పాటే పైడి జయరాజ్ పురస్కారాన్ని కమల్ హాసన్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డును నిర్మాత అశ్వనీదత్, కెఎల్ కాంతారావు ఫిల్మ్ అవార్డును ఆర్ నారాయణమూర్తి, సినారె అవార్డును రైటర్ సుద్దాల అశోక్ తేజ, అక్కినేని నాగేశ్వరరావు అవార్డును జయసుధ స్వీకరించారు. బీఎన్రెడ్డి ఫిల్మ్ అవార్డును సింగీతం శ్రీనివాసరావు తరఫున కమల్ హాసన్ అందుకున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos