రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తమ కస్టడీలోకి తీసుకుంది. రెండు రోజుల పాటు ఆయన్ను విచారించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించడంతో, ఈ ఉదయం సిట్ అధికారులు ఆయన్ను రాజమండ్రి నుంచి విజయవాడకు తరలించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డిని ఏ4 నిందితుడిగా చేర్చిన సిట్, ఆయన్ను ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఆయన్ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం, రెండు రోజులకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం, సెప్టెంబర్ 19, 20 తేదీల్లో అంటే ఇవాళ,  రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మిథున్ రెడ్డిని విచారించనున్నారు. కాగా, ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇదివరకే తిరస్కరించింది. ఈ కేసులో సుమారు రూ. 3,500 కోట్ల కుంభకోణం జరిగినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మరోవైపు, ఈ కేసు దర్యాప్తులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. కేసు తీవ్రత దృష్ట్యా ఈడీ అధికారులు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు, నగదు వివరాలపై సిట్ అధికారులతో ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో లిక్కర్ స్కాం దర్యాప్తు మరింత వేగవంతమైనట్లుగా తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos