తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనున్న ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 3న జరగనుంది. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కానుంది. తెలంగాణలో మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటితో పాటు వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.అలాగే ఏపీలో తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా - గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు, శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ విడుదలైన తక్షణమే ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos