ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి పాలనాదక్షుడని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. చంద్రబాబు విజన్ ఉన్న నేత, సంపదను సృష్టించి పేదరికాన్ని రూపుమాపాలని ఆలోచించే నాయకుడని కితాబునిచ్చారు. విద్యావేత్తలు, మేధావులకు చంద్రబాబుపై మంచి అభిప్రాయం ఉందని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కరిగిపోయే మనసున్న నేత అని అన్నారు. కాగా, లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి విశాఖకు వస్తున్నారని కృష్ణయ్య తెలిపారు. మోదీకి నీరాజనం పలికేందుకు విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విశాఖ అభివృద్ధికి కావాల్సిన చర్యలను ప్రధాని తీసుకుంటారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళతానని చెప్పారు. మోదీ ప్రధాని అయిన తర్వాత భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు.

ప్రధాని మోదీ విశాఖ సభ వేదికగా 12కు పైగా ప్రాజెక్టుల  శంకుస్థాపనలు, ఆరుకు పైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఈ పనుల విలువ దాదాపు రూ. రెండు లక్షల కోట్ల పైమాటే. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్‌టీపీసీ రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ను ప్రారంభిస్తున్నారు. దీనివల్ల 57 వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టును 1,600 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

Related Videos