ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పాలనకి ఏడాది పూర్తవనుండటంతో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించనుంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన ఏడాది ఉత్సవాలు చేస్తోంది జనసేన. సుపరిపాలన ప్రారంభమై ఏడాది.. పీడ విరగడై ఏడాది అంటూ.. ఈ నెల 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకోవాలని జనసేన నిర్ణయించింది.
ఈ ఉత్సవాల్లో భాగంగా జనసేన నేతలు, శ్రేణులు తమ వాకిళ్లను రంగవల్లులతో అలంకరించాలనీ, ముగ్గుల పోటీలు నిర్వహించాలనీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి దిశానిర్దేశం అందింది. దీంతోపాటు సాయంత్రం దీపావళి తరహాలో దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చాలని సూచించారు. ఈ వేడుకలన్నింటినీ సోషల్ మీడియాలో పోస్టులు రూపంలో ప్రదర్శించాలని పార్టీ కోరుతోంది. ఈ సందర్భంగా డిజిటల్ క్యాంపెయిన్కి కూడా జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
ఏపీలో గత ఏడాది మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి రికార్డు విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. అయితే ఈ క్రమంలోనే ఏపీలో కూటమి రికార్డు విజయం సాధించిన జూన్ 4వ తేదీ వేడుకలు నిర్వహించాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్య పార్టీ శ్రేణులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos