ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు భారీ ఊతం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఏకంగా రూ.13,340 కోట్ల విలువైన పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా నన్నూరు వద్ద నిర్వహించిన 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్' సభ వేదికగా ఆయన ఈ అభివృద్ధి పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రధాని మోదీ రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయగా, మరో రూ.1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన రూ.2,276 కోట్ల విలువైన పనులను ఆయన జాతికి అంకితం చేశారు.

కొత్తగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో రాయలసీమ అభివృద్ధికి కీలకమైన ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్‌లు ఉన్నాయి. వీటి నిర్మాణానికి రూ.4,920 కోట్లు కేటాయించారు. కర్నూలులో విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి రూ.2,880 కోట్లతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు కూడా ప్రధాని పునాదిరాయి వేశారు. వీటితో పాటు, రూ.960 కోట్లతో సబ్బవరం - షీలానగర్ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారికి, రూ.493 కోట్లతో కొత్తవలస - విజయనగరం మధ్య నాలుగో రైల్వే లైన్‌కు, రూ.184 కోట్లతో  పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్వే ఫ్లైఓవర్ లైన్‌కు శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా పలు పూర్తయిన ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. రూ.286 కోట్లతో నిర్మించిన కడప - నెల్లూరు - చునియంపల్లి రహదారులను, రూ.593 కోట్లతో పూర్తి చేసిన పీలేరు - కాలూరు సెక్షన్ నాలుగు లేన్ల రహదారిని ప్రారంభించారు. అంతేకాకుండా, రూ.546 కోట్ల విలువైన కొత్తవలస - కోరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులను, రూ.1,730 కోట్లతో నిర్మించిన శ్రీకాకుళం - అంగుల్ సహజవాయువు పైప్‌లైన్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక, రవాణా రంగాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos