ఏపీలో ప్రస్తుతం టీడీపీ అధికార పార్టీగా ఉంది. జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి గత ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని నడుపుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మంత్రివర్గంలోనూ యాక్టివ్ గా ఉన్నారు. అయితే భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని లోకేష్ సతీమణి బ్రాహ్మణిని సైతం ఇప్పుడే రాజకీయాల్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో జరుగుతూనే ఉంది. అయితే దీనిపై తాజాగా బ్రాహ్మణి నేరుగా స్పందించారు. బిజినెస్ టుడే సంస్థ ఈ నెల 12న ముంబైలో నిర్వహించిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ 2025' కార్యక్రమంలో పాల్గొన్న నారా బ్రాహ్మణి.. రాజకీయాల్లో ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరితే ఏమంటారని నిర్వాహకులు అడిగిన ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా ఆమె తన సమాధానం చెప్పేశారు. రాజకీయాలు తనకు ఆసక్తికరమైన రంగం కాదని, రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు తన మామగారు, సీఎం చంద్రబాబు అడిగితే రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారా అని ప్రశ్నిస్తే.. చంద్రబాబు అడిగినా రాజకీయాల్లోకి రానంటూ నారా బ్రాహ్మణి తేల్చి చెప్పేశారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థే తన తొలి ప్రాధాన్యమని, దాని ద్వారా సమాజంపై గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందని ఆమె వెల్లడించారు. అలాగే లక్షల మందిపై ప్రభావం చూపే అవకాశాన్ని తాను వదులుకోలేనని బ్రాహ్మణి తెలిపారు. ఇంకా చెప్పాలంటే పాడిరంగంలోని లక్షల మంది మహిళా రైతులు, కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఎందుకు వదులుకోవాలని అడిగారు. వ్యక్తిగతంగా ఆరోగ్యం, పోషణ రంగాలపై చిన్నప్పటి నుంచే తనకు ఎంతో ఆసక్తి ఉందని, ప్రస్తుతం ఆ రంగంలోనే పనిచేయడం సంతృప్తినిస్తోందని బ్రాహ్మణి తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos