రాజకీయ నాయకులు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాటిపై స్పందిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలా ప్రజల గళానికి స్పందిస్తున్న ప్రముఖుల్లో ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ పేరు ముందు వరుసలో నిలుస్తోంది. తాజాగా ఓ సామాన్య పౌరుడి ట్వీట్‌కు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం ఆయన చొరవకు నిదర్శనంగా నిలిచింది. పార్వతీపురం జిల్లా బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్‌కు చెందిన విద్యార్థులను రాజకీయ నిరసనల్లో పాల్గొనడానికి తీసుకెళ్లిన ఘటనపై, ఒక సామాన్య వ్యక్తి శ్యామ్ ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్‌కి విన్నవించాడు. ఆయన ట్వీట్‌లో ఏం రాశారంటే.. గౌరవనీయులైన విద్యాశాఖా మంత్రి లోకేష్‌కు.. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్‌లో జరిగిన ఆందోళనకర సంఘటన గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిన్న స్కూల్ యూనిఫారమ్‌లో ఉన్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే ఒకరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు తీసుకెళ్లారు. ఇది మాత్రమే కాదు, హెడ్‌మాస్టర్, ఎంఈవో రాజకీయ నిరసనకు అనుమతించారు. తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ బాధ్యతారాహిత్యానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

శ్యామ్ చేసిన ట్వీట్‌పై తక్షణమే స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో, విద్యార్థుల భద్రతను పణంగా పెట్టిన అధికారులు, రాజకీయ నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. "ఇది దారుణం, నేరం కూడా! వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. గాయపడిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందిస్తాం. పాఠశాలల్లో రాజకీయ జోక్యంపై ఇక నుంచి మినహాయింపు ఉండదు. విద్యార్థుల భవిష్యత్తుతో ఎవరూ ఆడుకోవద్దు. బాధ్యులపై చర్యలు తప్పవు" అని లోకేష్ ట్వీట్ చేశారు.

నారా లోకేష్‌ స్పందనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక ప్రజా నాయకుడిగా లోకేష్ తీసుకుంటున్న చొరవకు ఉదాహరణ" అంటూ కామెంట్లు చేస్తున్నారు. విద్యాసంస్థలు అనేవి విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకాలు కానీ.. రాజకీయాలకు వేదికలు కావని విమర్శలు గుప్పిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos