ఏపీ విద్యార్ధులకు ఇక తెలంగాణ కాలేజీల్లో ఇక పోటీ పడే ఛాన్స్ కోల్పోయారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఏపీ విద్యార్ధుల పైన ప్రభావం పడనుంది.  ఈ నేపథ్యంలో తెలంగాణ లోని వృత్తి విద్యా కోర్సుల కోసం పోటీ పడే ఏపీ విద్యార్ధులు ఇక ఆ అవకాశం కోల్పోయినట్లే. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఇక నుంచి ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం తొలగించింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో స్థానికత కోటాను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 85 శాతం సీట్లు తెలంగాణ స్థానిక విద్యార్థులకు రిజర్వుడు కోటాగా పేర్కొంది. మరో 15 శాతం అన్ రిజర్వ్​డు కోటాగా పరిగణించింది. 

అన్​రిజర్వ్​డు కోటాలోని సీట్లకు తెలంగాణలో కనీసం 10 ఏళ్లు నివసించినా, రాష్ట్రంలో పని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, లేదా ఉద్యోగుల భాగస్వాములు పోటీ పడేందుకు అవకాశం కల్పించింది. స్థానికత అంశంపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సర్కార్, ఆ కమిటీ నివేదిక ఆధారంగా కోటా కేటాయించినట్టు పేర్కొంది. ఇప్పటివరకు ఆయా వృత్తి విద్యా కోర్సు​లలో 15 శాతం ఏపీ విద్యార్థులు పోటీ పడేవారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం, రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి స్థానికత అమలుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు పలు పీజీ, వృత్తి విద్యాకోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్స్ సైతం విడుదల చేసారు. ఆ నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంలోపే స్థానికత అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. ఇప్పుడు ఏపీ విద్యార్ధులు తెలంగాణలో పోటీ పడే అవకాశం కోల్పోయారనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos