ఇంద్రీకీలాద్రి పై భక్తుల రద్దీ పెరిగింది. మూలా నక్షత్రం వేళ అమ్మవారి దర్శనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలి వచ్చారు. నవరాత్రుల్లో భాగంగా ఏడవరోజు బుధవారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ తన కుమార్తెతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. పవన్‌కు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కూతురు ఆధ్య తో ఆయన దర్శనానికి వచ్చారు. పవన్ కళ్యాణ్‌ను చూడగానే కొందరు జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో నినాదాలు చేయటం పైన పలువురు భక్తులు  ఆగ్రహం వ్యక్తం చేసారు.

అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఈ పరిస్థితిని అధికారులు ముందుగానే అంచనా వేసారు. కొండపైకి ఈరోజు ఎటువంటి వాహనాలను అనుమతించమని పోలీసులు వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అయితే, వీఐపీలకు ప్రాధాన్యత ఇస్తూ సామాన్యుల దర్శనం విషయంలో అధికారుల తీరు పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దర్శనం కోసం వచ్చిన భక్తురాలిపై పోలీసులు చేయి చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. దర్శనం సరిగ్గా చేసుకోనివ్వడం లేదని ఆరోపణ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులపై ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేసారు. మరోవైపు వీఐపీలకు కేటాయించిన స్లాట్‌లలో కాకుండా ఇతర సమయాల్లో వస్తే వారిని వీఐపీ మార్గంలో దర్శనాలకు అనుమతించడం లేదు. వారిని రూ.500 క్యూలో పంపుతున్నారు. లక్షలాది మంది భక్తులు ఈ దర్శనానికి వచ్చే అవకాశం ఉండడంతో మరింత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసామని అధికారులు వెల్లడించారు.

కాకా ముఖ్యమంత్రి చంద్రబాబు రాక సందర్భంగా నగరంలో కొన్ని ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నామని సీపీ తెలిపారు. డైనమిక్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ద్వారా ఎప్పటికప్పుడు సమయానుకూలంగా ఈ ఆంక్షలు ఉండే అవకాశం ఉందని అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos