ప్రధాని నరేంద్ర మోదీ రేపు గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాయలసీమ అభివృద్ధికి ఊతమిచ్చేలా సుమారు రూ.13,429 కోట్ల విలువైన 16 కీలక ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక స్మార్ట్ సిటీ, డ్రోన్ సిటీ, కొప్పర్తి పారిశ్రామిక పార్కు వంటివి ఈ ప్రాజెక్టులలో ప్రధానమైనవి. కర్నూలు నగర శివారులోని నన్నూరు టోల్‌ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన 'సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌' భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. దేశంలోనే జీఎస్టీ-2.0పై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడం గమనార్హం.

ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కూటమి నాయకులు హాజరుకానున్నారు. బహిరంగ సభకు ముందు ప్రధాని మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఢిల్లీ నుంచి నేరుగా ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళతారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామిని, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన భ్రమరాంబికా దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం, పురావస్తు శాఖ ప్రదర్శనకు ఉంచిన పురాతన తామ్ర శాసనాలు, రాగి రేకులను ఆయన తిలకిస్తారు. ప్రధాని పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కర్నూలులోనే మకాం వేసింది. సుమారు 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సభకు మూడు నుంచి నాలుగు లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తుండటంతో, అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో కేంద్ర బలగాలతో కూంబింగ్ నిర్వహించామని ఆయన తెలిపారు. ఒక్క శ్రీశైలంలోనే 1800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు నంద్యాల ఎస్పీ సునీల్‌ షెరాన్‌ వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా గురువారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలానికి రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos