ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి చంద్రబాబు నాయుడు తీరుపై మండిపడ్డారు. నటనలో దాన వీర శూర కర్ణ స్వర్గీయ ఎన్టీఆర్‌నే చంద్రబాబు మించిపోయారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ పరిపాలనపై ప్రెస్‌మీట్ నిర్వహించిన వైఎస్ జగన్ .. చంద్రబాబు నాయుడు పాలనపై విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రతీ ఆలోచనలోనూ కుట్రే ఉంటుందని, రైతులకు తోడుగా నిలిస్తే తమపైనే కేసులు పెట్టారన్నారు. తమ పార్టీ వాళ్లను పరామర్శించినా కేసులు పెడుతున్నారని, తన పర్యటనల్లో ఉద్దేశ పూర్వకంగానే ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటన పూర్తయిన తర్వాత తప్పుడు కేసులు పెడుతున్నారని, చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే పోలీసులు తమకు సహకరించడం లేదంటూ ఆరోపించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండదా అంటూ జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం, మీటింగ్‌లు పెట్టుకోవడం ఇవన్నీ హక్కులే కదా అని అడిగారు. రాజకీయ పార్టీకి ఉండాల్సిన మౌలిక హక్కులు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. గుడివాడలో దాడిని రాష్ట్రం మొత్తం చూసిందని, మహిళ అని కూడా చూడకుండా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి చేశారంటూ విమర్శించారు. బీసీ మహిళ ఉప్పాల హారికపై దాడి దుర్మార్గమంటూ ఖండించారు.

రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, ఉప్పాల హారికపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు దాడి చేశారంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. హారికను అనకూడని మాటలు అని.. ఆ తర్వాత మహానటి అంటూ ఆమెనే ఎద్దేవా చేస్తున్నారన్నారు. దానవీరశూరకర్ణ కంటే గొప్పగా నటించేది చంద్రబాబే అని, నటనలో ఎన్టీఆర్‌నే మించిపోయారని విమర్శించారు. బాబును చూస్తే సినిమా నటుడి కంటే ఎక్కువగా నటిస్తున్నారని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పోలీసులు ఉంటోంది తన పర్యటనల్లో భద్రత కల్పించేందుకు కాదని, తన కార్యక్రమానికి ఎవ్వరూ రాకుండా ఉండేందుకే అని.. ఇది ఆశ్చర్యం కలిగించే విషయమని వైఎస్ జగన్ అన్నారు. హైకోర్టు ఆదేశాలున్నా పోలీసులు అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై పోలీసులు సమక్షంలోనే దాడికి ప్రయత్నించారని.. బిహార్‌లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos