బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం భిన్నంగా మారుతోంది. ఒకవైపు పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా, మరోవైపు సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో చలి గాలులు, పొగమంచు వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. భూమధ్యరేఖకు ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రేపటికి అంటే బుధవారం  నాటికి  మరింత చురుగ్గా మారి పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంపై ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. దీనివల్ల రాత్రిపూట మరియు వేకువజామున చలి తీవ్రత అధికంగా ఉండనుంది. మరోవైపు, కోస్తాంధ్ర మరియు యానాం పరిసర ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల పాటు మోస్తరు పొగమంచు కురిసే అవకాశం ఉందని, వాహనదారులు వేకువజామున ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాయలసీమలో చలి పంజా విసురుతుంటే, కొన్ని ప్రాంతాల్లో పగటి వేడి క్రమంగా పెరుగుతోంది. తాజాగా నమోదైన వివరాల ప్రకారం.. కర్నూలులో అత్యధికంగా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. వేడి ప్రభావం 40 డిగ్రీలను తలపించింది. ఇక కనిష్టంగా కలింగపట్నంలో 29.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పగలు ఎండ తీవ్రత మొదలవుతున్నా, సాయంత్రం వేళల్లో చల్లని గాలులు వీస్తుండటంతో వాతావరణం మిశ్రమంగా ఉంది. రాబోయే మూడు రోజుల పాటు అంటే 19వ తేదీ వరకు రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని, ఆ తర్వాత వాతావరణంలో మార్పులు రావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం బలపడుతున్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos