ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీని నిలబెట్టుకుంది.. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు.. ఉండవల్లి నుంచి సింగ్నగర్కు ఆటోలో వెళ్లారు. ఈ పథకం కింద ఒక్కో ఆటో డ్రైవర్కు రూ. 15,000 ఆర్థిక సాయం డబ్బుల్ని విడుదల చేశారు. విజయవాడలోని సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 'ఆటో డ్రైవర్ల సేవలో' కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి నారా లోకేశ్ చంద్రబాబు, పవన్, మాధవ్లకు మంగళగిరి చేనేత కండువాలను కప్పి లోకేశ్ స్వాగతించారు. కూటమి నాయకులకు మద్దతుగా మంగళగిరి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మంగళగిరి యువత బాణసంచా కాల్చి, తీన్మార్ డప్పులతో సందడి చేశారు.
కాగా.. ఈ పథకంలో మీ పేరు ఉందో లేదో ఇప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు. దీని కోసం లాగిన్ అవసరం లేదు.. డ్రైవర్లు తమ ఆధార్ కార్డ్ నంబర్తో పథకం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఒక ప్రత్యేక లింక్ ద్వారా ఈ సేవ అందుబాటులో ఉంది. ఆటో డ్రైవర్లు తమ పథకం స్టేటస్ తెలుసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒకవేళ ఎవరికైనా ఆటో డ్రైవర్లకు డబ్బులు రాకపోతే మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అవసరమైన డాక్యుమెంట్లతో దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించాలని సూచించారు. అలాగే లిస్ట్లో పేరు లేకపోయినా గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించాలని సూచించారు. ఆ లింక్ ద్వారా ఈ వివరాలు చూడవచ్చు. ఆ లింక్ను క్లిక్ చేస్తే పథకం స్టేటస్, జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుస్తుంది. లింక్.. https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP.
అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఈ పథకానికి సంబంధించి.. స్టేటస్ చెక్ చేయడానికి ఇలా చేయాలి. ముందు NBM అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main. Home పేజీలో “Application Status / Public Navasakam Application Status” సెలక్ట్ చేసుకోవాలి. Scheme Dropdown లో “Financial Assistance to Auto and Maxi Cab Owners (Auto Driver Sevalo / Vahana Mitra)” సెలక్ట్ చేయాలి. ఆ తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్ & క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. ఆధార్కు లింక్ చేసిన మొబైల్ నంబర్కు వచ్చే OTP ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Submit / Check Status క్లిక్ చేస్తే వెంటనే Application Status చూడొచ్చు.
సీఎం చంద్రబాబు ఆగస్టు 15న స్త్రీశక్తి పథకం ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించే ఈ పథకం మొదలుపెట్టినప్పుడు.. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం హామీ ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా.. సీఎం చంద్రబాబు ఆగస్టు 15న హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos