వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ ప్రకటించడం ఆ పార్టీలో కొత్త దుమారానికి కారణం అవుతోంది. పైకి ఎవరూ మాట్లాడకపోయినప్పటికీ చాలామంది సీనియర్లు ఇక పార్టీలో యాక్టివ్‌గా ఉండటం కన్నా వీలైనంత మౌనం పాటిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్న సీనియర్ల కన్నా సజ్జల ఏ మాత్రం సీనియర్ కాదు. ఆయన జగన్‌ కోటరీని నడుపుతున్నారన్న అసంతృప్తి వారిలో ఉంది. 

2014లో గెలుస్తామనుకున్న వైసీపీ నేతలు ఓడిపోయారు. అయితే ఐదేళ్ల పాటు కష్టపడ్డారు. ఈ కష్టంలో మొదట జగన్ మోహన్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉంటే తర్వాత విజయసాయిరెడ్డి పాత్ర కీలకం. ఆయన 2019 ఎన్నికలకు ముందు సర్వం తానే అయి వ్యవహరించారు.  ఐ ప్యాక్ తో పాటు అభ్యర్థుల ఎంపిక, వారికి ఆర్థిక వనరుల సమకూర్చడం .. బీఆర్ఎస్ తో సమన్వయం చేసుకుని టీడీపీని ఇబ్బంది పెట్ట డం వరకూ మొత్తం ఆయనే చేశారు. అందుకే రిజల్ట్ వచ్చినప్పుడు మొదటగా జగన్ .. విజయసాయిరెడ్డిని హగ్ చేసుకుటున్న ఫోటోనే బయటకు వచ్చింది. ఈ మధ్య కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం మీడియా వ్యవహారాలు చూసేవారు. కానీ పార్టీ గెలిచిన తర్వాత అందరూ వెనుకబడిపోయారు. సజ్జల ముందుకు వచ్చారు.

విజయంలో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు వెళ్లిపోయారు. ముఖ్య సలహాదారుడిగా ఉన్న  సజ్జల రామకృష్ణారెడ్డి మెల్లగా జగన్ దగ్గర పలుకుబడి పెంచుకున్నారు. ఎంతగా అంటే ఆయన చెబితేనే ఏదైనా జరుగుతుందన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. సకల శాఖల మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్నారు. జగన్ ను కలవనీయకుడా ఎమ్మెల్యేలను అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ చార్జి గా ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించి ... సజ్జల తన కుమారుడ్ని నియమించుకున్నారు. ఇలా మొత్తంగా ఆయనే కీలకం అయ్యారు. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది.దాంతో సహజంగా ఆయనదే బాధ్యతని అందరూ విమర్శించడం ప్రారంభించారు. ఇప్పుడు సజ్జలను  మళ్లీ ఇంచార్జ్ గా నియమిస్తే తాము ఎలా రాజకీయాలు చేయాలని సీరియర్లు తలలు పట్టుకుంటున్నారు. ఎంతటి సీనియర్లు అయినా మీడియా ముందు మాట్లాడాలంటే సజ్జల ఆఫీసు నుంచి స్క్రిప్ట్ రావాల్సిందేనని.. లేకపోతే మాట్లాడవద్దని చెబుతారని అంటున్నారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం పార్టీపై ఉన్నంత కాలం... అంటీముట్టనట్లుగా ఉంటేనే మంచిదని చాలా మంది సీనియర్లు అభిప్రాయానికి వచ్చారని, అందువల్లనే ఇక ఎవరి వాయిస్ మీడియా ముందు వినిపించదని పార్టీలోనూ, బయటా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos