వైసీపీకి పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో ప్రాతినిధ్యం భారీగా తగ్గనుంది. జూన్ నెలలో ఆ పార్టీకి చెందిన ముగ్గురు రిటైర్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు సభ్యుల పదవీ కాలం జూన్ నెలతో ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఏప్రిల్‌లోనే ఎన్నికలు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం, ఈ నాలుగు స్థానాలు క్లీన్ స్వీప్‌గా అధికార తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం కేవలం నాలుగు స్థానాలకే పరిమితం కానుంది. ఒకప్పుడు 11 స్థానాలతో బలంగా ఉన్న వైసీపీ, వరుసగా సభ్యుల రాజీనామాలు, పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు నామమాత్రపు శక్తిగా మారుతోంది.

ఈ నాలుగు స్థానాలు ఎవరికి దక్కుతాయనే అంశంపై అమరావతిలో జోరుగా చర్చ సాగుతోంది. పొత్తు ధర్మం ప్రకారం, నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కనీసం రెండు లేదా మూడు స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది. మిగిలిన ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించే ఛాన్స్ ఉంది. అయితే, కేంద్రంలో ఉన్న సమీకరణాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ కూడా ఒక స్థానాన్ని ఆశించే అవకాశం లేకపోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి అగ్రనేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. టీడీపీ నుంచి సీనియర్ నేతలు, గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న సీనియర్లు, సామాజిక సమీకరణాల్లో కీలకమైన నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

దేవినేని ఉమ, గల్లా జయదేవ్, చింతకాయల విజయ్, మహాసేన రాజేశ్, ఇలా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. జనసేన నుంచి ఆ పార్టీ కీలక నేతలకు లేదా అధినేత పవన్ కళ్యాణ్ సూచించిన వ్యక్తికి అవకాశం దక్కవచ్చు. ఈ నాలుగు సీట్లూ కూటమికి దక్కడం వల్ల, కేంద్రంలో ఎన్డీయే బలం మరింత పెరగడమే కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గళం విప్పే అవకాశం లభిస్తుంది.  గతంలో వైసీపీ తరపున ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్య వంటి నేతలు రాజీనామా చేయడం ఆ పార్టీకి ఇప్పటికే పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు పదవీ కాలం ముగియడం వల్ల సహజంగానే స్థానాలు తగ్గిపోతున్నాయి. అసెంబ్లీలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో, వైసీపీ కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకునే పరిస్థితి లేదు. దీనివల్ల జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ ప్రభావం గణనీయంగా తగ్గిపోనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

17-37-49-0649.jpg

రాజ్యసభ జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
2026-06-06 Time: 05:37:49

17-10-05-0605.jpg

రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తా.. నామినేషన్ దాఖలు అనంతరం మీడియాతో లింగమనేని రమేష్ 
2026-06-06 Time: 05:10:05

14-47-28-0628.jpg

శ్రీసిటీలో రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లు ఏర్పాటు చేయండి.. నోవోస్టల్ ఎం చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో కు  మంత్రి నారా లోకేష్ విజ్ఞ‌ప్తి
2026-06-04 Time: 02:47:28

17-11-24-0624.jpg

పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్ ల నిర్మాణంలో భాగస్వామ్యం వహించండి.. రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సిఇఓ ఇల్యా కోసిహ్ తో మంత్రి లోకేష్ భేటీ
2026-06-03 Time: 05:11:24

17-08-34-0634.jpg

హెల్తీ సిటిజన్స్‌తోనే వెల్తీ నేషన్ నిర్మాణం.. లలితా పీవీఎస్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు 
2026-06-03 Time: 05:08:34

Related Videos