తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు కూడా శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. మార్చి 24 నుంచి ఈ విధానం అమలు చేయనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇక ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలను వారంలో రెండు రోజులు మాత్రమే అనుమతిస్తారు. ఒక్కో ప్రజాప్రతినిధి రోజుకు ఒక్క లేఖ జారీ చేయడానికి అవకాశం ఇస్తారు. ఆ లేఖపై ఆరుగురు దర్శనం చేసుకోవచ్చు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఆది, సోమవారాల్లో మాత్రమే తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తారు. వీరికి సోమ, మంగళవారం మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. అలాగే రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను బుధ, గురువారాలల్లో మాత్రమే టీటీడీ స్వీకరించనుంది. వీరికి ఏ రోజుకారోజు దర్శనం కల్పిస్తారు. ఇక ఒకరికి రోజుకు ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతిస్తారు. అలాగే ఆరుమందికి మించకుండా స్వీకరించడం జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos