ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు మూడు ప్రధాన వ్యవసాయ బోర్డులను ఏర్పాటు చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. గుంటూరులో మిర్చి బోర్డు, శ్రీకాకుళంలో జీడిపప్పు బోర్డు, చిత్తూరులో మామిడి బోర్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటితో పాటు, విభజన చట్టంలోని హామీ మేరకు శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా, తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర నష్టాలను అచ్చెన్నాయుడు కేంద్రమంత్రికి వివరించారు. మార్కెట్‌లో ధర కిలోకు రూ. 8కి పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, ధరల లోటు చెల్లింపు పథకం కింద మద్దతు ధరగా రూ. 12 నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇందుకోసం 6.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 260 కోట్లు ఖర్చు చేస్తోందని, ఈ భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కూడా భాగస్వామ్యం కావాలని అభ్యర్థించారు. అలాగే, వెనుకబడిన జిల్లాలకు మైక్రో ఇరిగేషన్ పథకం కింద రాయితీని పెంచాలని, ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని కోరారు. అచ్చెన్నాయుడు చేసిన వినతులపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos