ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు రేపు అంటే 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి సినీ పరిశ్రమకు చెందిన 35 నుంచి 40 మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. వారందరూ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి చర్చల్లో పాల్గొననున్నారు. ఈ భేటీలో ఏపీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజీ వ్యవహారంపై చర్చలు నడుస్తున్నాయి. అద్దెల రూపంలో మూవీలను ప్రదర్శించడం సాధ్యం కావడం లేదని ఎగ్జిబిటర్లు అంటుంటే.. పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా థియేటర్ల బంద్ కు పిలుపునివ్వడం.. ఆ తర్వాత బంద్ నిర్ణయాన్ని వాయిదా వేయడం జరిగి పోయాయి.  థియేటర్ల బంద్‌ అంశంపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే తీవ్రంగా స్పందించారు. "కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా సీఎం చంద్రబాబుని కలిశారా అని సినీ ప్రముఖులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే పవన్ సినిమాకి కావాలనే అడ్డంకులు సృస్థించడం కోసం ఆ నలుగురు అలా ప్లాన్ చేశారని కూడా టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి.

ఈ క్రమంలో... పలువురు నిర్మాతలు సైతం ఆ నలుగురం మేము కాదంటూ ఓపెన్ గానే స్టేట్ మెంట్స్ ఇచ్చారు. తర్వాత ముఖ్యంగా థియేటర్‌ల పరిస్థితి, మౌలిక సదుపాయాలపై ఇటీవల సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాల మేరకు అధికారులు పలు థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లోనే ఏపీలో చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య సహకారం పెంపొందించేందుకు ఈ సమావేశం కీలకం కానుంది. సీఎం సూచన మేరకు మంత్రి కందుల దుర్గేష్ సినీ ప్రముఖులకు ఆహ్వానం పంపారు. సమావేశం అనంతరం ఆయన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos