ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26పై స్పందించారు. ప్రజలకు ఉపయోగకరమైన మరియు ప్రగతిశీల బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత భారత్ విజన్ను ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ రూపొందించబడిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్లో మహిళా సంక్షేమం, పేదలు, యువత మరియు రైతులకు ప్రాధాన్యత ఇవ్వబడిందని చంద్రబాబు వివరించారు. అంతేకాకుండా, రాబోయే ఐదు సంవత్సరాలలో ఆరు కీలక రంగాల్లో అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేయబడ్డాయని ఆయన పేర్కొన్నారు.
ఈ బడ్జెట్ దేశ సంక్షేమం దిశగా ఒక కీలక ముందడుగు. ఇది మన దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును అందించేలా సమగ్రమైన మరియు కచ్చితమైన బ్లూప్రింట్గా నిలుస్తుంది. ఈ బడ్జెట్ ద్వారా మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అనదగిన మధ్యతరగతి ప్రజలకు పన్ను ఊరట కల్పించారు. నేను ఈ బడ్జెట్ను స్వాగతిస్తున్నాను అని ట్వీట్లో తెలిపారు. ఈ బడ్జెట్ దేశ అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి మరింత దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos