ఏపీలోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొత్త రికార్డు నెలకొల్పారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజల మధ్యనే ఉండే కోటంరెడ్డి కూటమి ప్రభుత్వంలో 175 నియోజకవర్గాలు సాధించలేని అరుదైన ఘనత సాధించారు. దాదాపు 41 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో మొత్తం 339 అభివృద్ధి పనులను రికార్డు సమయంలో పూర్తి చేసి అన్ని పనులనూ ఒకే రోజు ప్రారంభించారు. దీంతో.. కోటంరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసిస్తూ లేఖ రాసారు. నియోజకవర్గ ప్రజల్లోనూ కోటంరెడ్డి పనుల విషయంలో దూకుడుగా ఉంటూ పూర్తి చేయటాన్ని పలువురు అభినందిస్తున్నారు.

తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖలో కోటంరెడ్డిని అభినందించారు. రూ.41 కోట్లతో నియోజక వర్గంలో 339 పనులు చేపట్టి కేవలం 60 రోజుల్లో పూర్తిచేయడం, వాటిని ప్రారంభించుకోవడం శుభపరిణామంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు మాట ఇచ్చినట్లుగా శంకుస్థాపన చేసి, నిర్ణీత సమయానికి వాటిని పూర్తి చేసి ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. కోటంరెడ్డి పట్టుదల, చిత్తశుద్ధి అందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న రూ.232 కోట్ల విలువైన పనులు కూడా త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కార్యక్రమాలు చేపడుతున్న కోటంరెడ్డికి అభినందనలు తెలిపారు. తనకు లేఖ ద్వారా అభినందనలు తెలిపిన చంద్రబాబుకు కోటంరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉండగా కాంగ్రెస్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన కోటంరెడ్డి ఏ పార్టీలో ఉన్నా ప్రజలతో మమేకం అయ్యేవారు. పనులు చేయించటంలో ఆయన శైలే వేరు. వైసీపీలో ఉన్న సమయంలోనూ ప్రజా సమస్యల పైన స్పందించకపోవటంతో అధికారులను నిలదీసారు. ప్రభుత్వంలోని పెద్దలతోనూ విభేదించారు. ప్రజా సమస్యల విషయంలో దూకుడుగానే వ్యవహరించే వారు. తన నియోజకవర్గంలో ఒకే రోజులో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు. అంతటితో వదల కుండా వాటిని నిరంతర పర్యవేక్షణ కోసం స్కూటీ మీద తిరుగుతూ సూచనలు చేసేవారు. తాజాగా, ఆపరేషన్ సిందూర్ పేరుతో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నియోజకవర్గంలో ఏడాది కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా పూర్తి చేస్తూ .. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos